ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Participated in Way2news conclave 2026 at JRC Convention, Hyderabad.

“రానున్న పదేళ్లలో తెలంగాణ ఎలా ఉండబోతోంది” అన్న థీమ్‌తో వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. రాష్ట్రంలోని సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రణాళికలు, రాజకీయాల వంటి అనేక అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు సూటిగా, నిర్మొహమాటంగా ఈ వేదిక ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు.

Read More »

ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి గారితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయింది.

హైదరాబాద్ లో ఉన్న ఉబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరిస్తున్నట్లు ఖోస్రోషాహి గారు తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ఇక్కడ 600 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆసక్తిని వ్యక్తీకరించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inaugural Programme of Education Week as part of Praja Palana – Pragathi Pranalika at LB Stadium, Hyd.

 ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా శాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. కోర్ అర్బన్ ఏరియా CURE లో 1011 కోట్ల రూపాయలతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble Prime Minister Sri Narendra Modi along with Hon’ble Chief Minister Sri A. Revanth Reddy launches multiple development projects in Hyd.

తెలంగాణలో పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా హైదరాబాద్ హెచ్ఐసీసీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ గారు, రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు.

Read More »

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేట భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు భూమి పూజ నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేట భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు భూమి పూజ నిర్వహించారు. ఇదే సందర్భంగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of The Hospital of Gratitude by Apollo Hospitals at Financial District, Hyd.

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో హాస్పిటల్ (The Hospital of Gratitude) ను మంత్రి దామోదర రాజనర్సింహ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా అపోలో వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారితో పాటు యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి గారు అభినందించారు.

Read More »

Hon’ble CMSri A. Revanth Reddy Participated in Inaugural Programme of SPANDANA (Takshana Rakshana) Teams at ICCC Hyd.

‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి స్పందన (తక్షణ రక్షణ) వాహనాలకు ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నగర పోలీసులు, పీస్ కమిటీ సభ్యులతో జరిగిన సమావేశంలో స్పందన టీమ్‌లను ప్రారంభించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the Flag-off Ceremony of Vikram-1 Rocket at Skyroot Aerospace HQ (Max-Q Campus), GMR Aerospace Park, Shamshabad, Hyd.

ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రం-1 ఆర్బిట్ రాకెట్‌ను ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి అంతరిక్షం పేరుతో స్కైరూట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, సంస్థ ప్రతినిధుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు విక్రం-1 రాకెట్ హార్డ్‌వేర్‌ను ప్రారంభించారు

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in release of Rythu Bharosa funds | ‘Praja Palana – Rythu Utsavalu’ public meeting at Nasturpally, Kataram Mandal, Jayashankar Bhupalpally district

రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో పాల్గొన్నారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in bhoomi puja for the renovation of Sri Kaleshwara Mukteshwara Swamy Temple at Kaleshwaram, Jayashankar Bhupalpally district.

బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీతీరం వెంట ఉన్న అన్ని ఆలయాలను అభివృద్ధి చేయాలన్న సంకల్పంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం పునరుద్ధరణకు భూమి పూజ నిర్వహించారు.

Read More »
Skip to content