ప్రధాన కంటెంట్‌కు వెళ్లడానికి

Search Results

హైద‌రాబాద్ మెట్రో ఫేజ్‌-IIకు ఆమోదం తెల‌పాల‌ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కేంద్ర ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌ గారికి విజ్ఞ‌ప్తి చేశారు

హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ -II, ఫేజ్‌ -III విస్త‌ర‌ణ స‌జావుగా సాగాల‌నే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్‌-Iను L&T MRHL ను రాష్ట్ర ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుంద‌ని వివ‌రించారు. ప్రస్తుతం ఫేజ్-I ప్రభుత్వం ప‌రిధిలో ఉండ‌డంతో ఫేజ్‌-II, ఫేజ్‌-III విస్తరణ సులుభమవుతుందని చెప్పారు.

Read More »

విద్యా సిలబస్‌లో AI వినియోగంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం

తెలంగాణ భ‌విష్య‌త్తు ప్ర‌ణాళికపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్య‌మంత్రి గారి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌మావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రఘురామ్ రాజన్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

Read More »

పంట మార్పిడి విధానాలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (రైతు కమిషన్) ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి నివేదికను సమర్పించింది.

పంట మార్పిడిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కమిషన్‌ను కోరారు. ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి గారు, రైతు కమిషన్ సభ్యులు రాములు నాయక్ గారు, సునీల్ గారు, రాంగోపాల్ రెడ్డి గారు, జి.గంగాధర్ గారు, కేవీ నర్సింహా రెడ్డి గారు, సీహెచ్ వెంకన్న యాదవ్ గారు, ఎం. భవాని గారు ఉన్నారు.

Read More »

పే రివిజన్ కమిషన్ (PRC) నివేదికను తక్షణమే అందించాలని అధికారుల కమిటీని ఆదేశించామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు.

తెలంగాణ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (JAC), తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులు ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారితో పాటు ఎంపీలు వేం నరేందర్ రెడ్డి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Read More »

విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారితో కలిసి ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు.

రాష్ట్రంలో నూతన పారిశ్రామిక వాడలు, హైస్పీడ్ రైల్ కారిడార్లు, ట్రిపుల్ ఆర్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు రానున్న నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విద్యుత్ సరఫరాకు అవసరమైన సబ్‌స్టేషన్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు.

Read More »

ఆర్టీసీ సమస్యలను వంద శాతం పరిష్కరిస్తామని, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ (TGS RTC) మ‌నుగ‌డ‌, గౌర‌వాన్ని పెంపొందించి ప్ర‌యాణికులకు మెరుగైన సేవ‌లందించేందుకు స‌మ‌గ్ర కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు రావాల‌ని కార్మిక సంఘాల ప్ర‌తినిధుల‌కు ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సూచించారు.

Read More »

విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన సామ‌గ్రి అంతా స‌కాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

విద్యా శాఖ‌తో పాటు బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ‌ల ప‌రిధిలోని విద్యా సంస్థ‌ల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల‌కు అంద‌జేసే సామ‌గ్రి సెంట్ర‌లైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌పై ముఖ్య‌మంత్రి ఉన్నతస్థాయి సమావేశంలో స‌మీక్షించారు.

Read More »

తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టే కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి గారు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారితో పాటు నీటి పారుదల శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Read More »

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేట భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు భూమి పూజ నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్‌పేట భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు భూమి పూజ నిర్వహించారు. ఇదే సందర్భంగా గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ భవనానికి శంకుస్థాపన చేశారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Inauguration of The Hospital of Gratitude by Apollo Hospitals at Financial District, Hyd.

హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో హాస్పిటల్ (The Hospital of Gratitude) ను మంత్రి దామోదర రాజనర్సింహ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా అపోలో వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారితో పాటు యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి గారు అభినందించారు.

Read More »
Skip to content