[language-switcher]
        Skip to main content

Search Results

హైదరాబాద్, హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత కీలకమైన రోడ్ నెట్‌వర్క్ విస్తరణ, జరుగుతున్న పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారులతో సమీక్షించారు.

రోడ్ల నిర్మాణంలో ప్రధానమైన భూసేకరణ, రుణ సేకరణ, నిర్వహణ వంటి అంశాలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, నగరంలోని ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, ఇతర రోడ్లన్నింటినీ ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సూచించారు.

Read More »

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy met His Excellency Sergio Gor, U.S. Ambassador to India, in New Delhi.

భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌ గారితో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. తెలంగాణలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు.

Read More »

ప్రాణ‌హిత న‌దిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపున‌కు మ‌హారాష్ట్ర నుంచి అనుమ‌తులు ఇప్పించాల‌ని జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌ గారికి ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు.

తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ప్రాధాన్య‌త‌, ప్రాజెక్టుకు అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గారికి తాను రాసిన లేఖ‌, దానికి ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం స్పందించి జ‌ల్‌శ‌క్తి శాఖకు పంపిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి గారు ప్ర‌స్తావించారు.

Read More »

కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి గారితో కలిసి పార్ల‌మెంట్‌లో కేంద్ర మంత్రి భూపేంద‌ర్ యాద‌వ్‌ గారితో స‌మావేశ‌మ‌య్యారు.

Read More »

పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులను ఆదేశించారు.

పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘా వర్గాలు ముఖ్యమంత్రి గారికి కీలక సమాచారం అందించాయి.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Sri Ujjaini Mahankali Bonalu Jathara at Secunderabad.

అంగరంగ వైభవంగా సాగుతున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More »

సీఐఐ ఉత్త‌ర భార‌త (CIINR) ప్ర‌తినిధులు ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యారు.

వివిధ రంగాల్లో పెట్టుబ‌డుల‌కు తెలంగాణ సుర‌క్షిత స్థాన‌మ‌ని, తెలంగాణ‌కు వ‌చ్చి పెట్టుబ‌డులు పెట్టాల‌ని భార‌త ప‌రిశ్ర‌మ‌ల స‌మాఖ్య (CII) ఉత్త‌ర భార‌త ప్ర‌తినిధుల‌ను ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆహ్వానించారు. తెలంగాణలోని ప్ర‌జా ప్ర‌భుత్వం పెట్టుబడుల‌కు రక్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని హామీ ఇచ్చారు.

Read More »

రాష్ట్రంలోని త‌ల‌సేమియా, సికిల్‌సెల్ అనీమియా బాధితులంద‌రికీ పింఛ‌న్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు.

పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల‌పై మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారితో క‌లిసి ముఖ్య‌మంత్రి గారు స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంట‌రి మ‌హిళ‌లు, నేత‌, గీత కార్మికులంద‌రికీ సంతృప్తిక‌ర స్థాయిలో పింఛ‌న్లు మంజూరు చేయాల‌ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

Read More »

Hon’ble CM Sri A. Revanth Reddy participated in an interaction with Delegates of the Finland & Germany Exposure Programme at Dasarathi Auditorium, MCRHRD, Hyd.

“టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్‌” లో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ప్రతినిధులతో హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ దాశరథి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ముఖాముఖి మాట్లాడారు.

Read More »

స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ పవన్ కె. చందన, సీఓఓ భరత్ డాకా ఢిల్లీలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు

అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావ‌ర‌ణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్నారు.

Read More »
Skip to content