Skip to main content

Photo Gallery

ఎల్‌బీ స్టేడియంలో విద్యార్థులకు కిట్ల పంపిణీ, విద్యా అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

“విద్యార్థులు బాగా బాగా చదువుకోవాలి. చదువుకోవడానికి ఏం కావాలో సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటా. పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కాకుండా భవిష్యత్తులో రవాణా సౌకర్యం కల్పించాలని ఆలోచన చేస్తున్నాం.

ఎల్‌బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని గుర్రంగూడ ఎకోపార్క్‌లో ముఖ్యమంత్రి గారు మొక్కను నాటి వనమహోత్సవం – 2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వనమహోత్సవంలో భాగంగా పలు జిల్లాల్లో మొక్కలు నాటడం, వనాల పెంపుతో పాటు వన్య ప్రాణుల సంరక్షణ, ప్రకృతి సంరక్షణకు సంబంధించి రూ.35.50 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో రూ. 17.84 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులకు శ్రీకారం చుట్టారు.

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurated the Telangana Public School at Arutla, Manchal Mandal, Rangareddy district.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి యువతకు ఈ ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని అంకితం చేశారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Inaugurated the Future City Development Authority Office Building at Bharat Future City, Hyderabad

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీలో రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ #FCDA భవనాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. తర్వాత ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోర్టల్‌ను ప్రారంభించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Mahila Varotsavalu–2026, Flags Off SHG Women-Owned Buses, at Parade Grounds, Secunderabad.

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కింద సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. మహిళా శక్తి పథకం – మహిళా సంఘాల యాజమాన్యంలోని 553 బస్సుల నిర్వహణను టీజీఆర్టీసీకి అప్పగించే కార్యక్రమంలో బస్సులకు ముఖ్యమంత్రి గారు జెండా ఊపి ప్రారంభించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy inaugurates various development works in the Cyberabad Municipal Corporation I addresses the public at Miyapur Cross Roads.

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ భవనంతో పాటు మొత్తం రూ. 1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

Skip to content