
పంట మార్పిడి విధానాలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ (రైతు కమిషన్) ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి నివేదికను సమర్పించింది.
పంట మార్పిడిపై మరింత లోతుగా అధ్యయనం చేసి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కమిషన్ను కోరారు. ముఖ్యమంత్రి గారిని కలిసిన సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి గారు, రైతు కమిషన్ సభ్యులు రాములు నాయక్ గారు, సునీల్ గారు, రాంగోపాల్ రెడ్డి గారు, జి.గంగాధర్ గారు, కేవీ నర్సింహా రెడ్డి గారు, సీహెచ్ వెంకన్న యాదవ్ గారు, ఎం. భవాని గారు ఉన్నారు.








