
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Statue Unveiling Ceremony of Sri Sardar Sarvai Papanna Goud on His 376th Jayanti at Tank Bund, Hyd.
రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పునరుద్ఘాటించారు. ట్యాంక్బండ్ పైన ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహాన్ని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రానికి పుష్పాంజలి ఘటించారు.








