
MoU with the UPC–Volt joint venture on the sidelines of the WEF 2026 in Davos.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం దావోస్లో యూపీసీ–వోల్ట్ సంయుక్త భాగస్వామ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం దావోస్లో యూపీసీ–వోల్ట్ సంయుక్త భాగస్వామ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది.

ప్రతి ఏటా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు అనంతరం, దానికి ఫాలోఅప్గా హైదరాబాద్లో జూలై – ఆగస్టు నెలల్లో సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సదస్సు ప్రతినిధుల ముందు ప్రతిపాదించారు.

హైదరాబాద్లో ప్రపంచంలోనే తొలిసారి ‘స్విస్ మాల్’ ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముఖ్యమంత్రి ప్రతిపాదించగా, స్విస్ బృందం సానుకూలంగా స్పందించింది.

తెలంగాణ రైజింగ్ విజన్–2047 అంశాలతో పాటు రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల వాతావరణం, ప్రభుత్వ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను ముఖ్యమంత్రి గారు టాటా గ్రూప్ చైర్మన్ గారికి వివరించారు.

ఫార్మా, వ్యాక్సిన్, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రస్తుతం ఉన్న బలమైన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ, 2030 కల్లా ప్రపంచ స్థాయిలోని టాప్-3 లైఫ్ సైన్సెస్ కేంద్రాలలో ఒకటిగా తెలంగాణను తీర్చిదిద్దడం ఈ పాలసీ లక్ష్యం.

క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు వేసింది. సుమారు 6 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) సమర్పించింది.

ప్రపంచంలోనే తొలి బ్యూటీ–టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC)ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ (L’Oreal) సంస్థ ప్రకటించింది. ఈ అత్యాధునిక కేంద్రాన్ని ఈ ఏడాది నవంబర్లోనే ప్రారంభించనుంది.

ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలను వేగవంతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం దావోస్లో కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ (Blaize) సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

అమెరికాకు చెందిన సర్గాడ్ (Sargad) సంస్థ తెలంగాణలో విమానాల నిర్వహణ, మరమ్మత్తులు, పునరుద్ధరణ కేంద్రం – (మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్ – MRO) నెలకొల్పనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దశలవారీగా 1,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో సర్గాడ్ సంస్థ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపింది.
Site Map | Screen Reader | Contact | Terms Of Use | Disclaimer | Accessibility | Website Policies | Cyber Security | Help | FAQs | Grievance
Copyright © 2015-2024 Government of Telangana. Last updated on [last-modified].