Skip to main content

Photo Gallery

Hon’ble CM Sri A. Revanth Reddy participated in the launch of Bala Bharosa and Pranamam schemes at Jyotirao Phule Praja Bhavan.

జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Hon’ble CM Revanth Reddy Participated in the Inauguration of Suzen Medicare Pvt Ltd Manufacturing Unit at Maheshwaram.

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఈ-సిటీలో నెలకొల్పిన సుజెన్ మెడికేర్ (Suzen Medicare) ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in Meeting on Irrigation Department at Jyotirao Phule Praja Bhavan, Hyderabad.

కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడటంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. నీటి హక్కులను కాపాడుకోవడంలో గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోందని చెప్పారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in felicitation ceremony for newly elected Sarpanches at Kodangal.

కొడంగల్ శాసనసభ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల కోసం కోస్గీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రతినిధులను ముఖ్యమంత్రి గారు సత్కరించి అభినందనలు తెలియజేశారు.

Hon’ble CM Sri A. Revanth Reddy Participated in Christmas Celebrations 2025 at LB Stadium, Hyderabad.

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు క్రిస్టియన్ పెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు. క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి గారు క్రిస్మస్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Hon’ble CM Sri A. Revanth Reddy participated in a friendly football match with legendary footballer Lionel Messi at the Uppal Stadium

మెస్సీ స్టేడియంలోకి అడుగుపెట్టడం నుంచి ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఎగ్జిబిషన్‌ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్-9 టీమ్ తరఫున ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గోల్ సాధించి హైలైట్‌గా నిలిచారు.

Skip to content