Skip to main content

Photo Gallery

CM Sri A. Revanth Reddy ordered a comprehensive inquiry into the tragic reactor blast at a chemical factory in Pashamilaram, Sangareddy District.

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో జరిగిన దుర్ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సమగ్రమైన దర్యాప్తునకు ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం సమగ్రమైన కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పారు. ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక కోటి రూపాయల చొప్పున పరిహారం అందే విధంగా చూస్తుందని తెలిపారు.

CM Sri A. Revanth Reddy instructed officials to transform Telangana’s Anganwadis into role models for the country.

తెలంగాణ అంగ‌న్‌వాడీలు దేశానికి రోల్‌మోడ‌ల్‌గా నిలిచేలా తీర్చిదిద్దాల‌ని.. ఇందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారుల‌ను ఆదేశించారు. అంగ‌న్‌వాడీల‌కు వ‌చ్చే పిల్ల‌ల‌కు పౌష్టికాహారం అందించ‌డంతో పాటు అయిదేళ్ల వ‌ర‌కు వారికి పూర్వ ప్రాథ‌మిక విద్య‌ను అందించి నేరుగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు వెళ్లేలా చూడాల‌ని సూచించారు.

CM Sri A. Revanth Reddy garu expressed his deepest condolences and prayers for the loved ones and families of those who lost their lives in today’s tragic accident at a chemical factory in Pashamylaram, Sangareddy District.

పాశమైలారం ప్రమాద ఘటన వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, మంత్రులు దామోదర్ రాజనర్సింహ గారు, వివేక్ వెంకటస్వామి గారు, సీఎస్, డీజీపీ గార్లకు అవసరమైన ఆదేశాలు జారీచేశారు.

Chief Minister Sri A. Revanth Reddy review meeting with Industries Minister Sri Duddilla Sridhar Babu and senior officials.

భారత్ ఫ్యూచర్ సిటీ కోసం భూ సేకరణ ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే పారిశ్రామిక వేత్తలు ఎవరూ వెనక్కి వెళ్లరాదని, ఆ రకమైన ప్రణాళికలతో పరిశ్రమల శాఖ సర్వసన్నద్ధంగా ఉండాలని చెప్పారు.

CM Sri A. Revanth Reddy participated in the inauguration of PJR Flyover and public meeting at Gachibowli, Hyderabad.

గచ్చిబౌలి కూడలిలో ఆరు లేన్లతో నిర్మించిన దివంగత పి జనార్ధన్ రెడ్డి ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణను మూడు ప్రాంతాలుగా.. ఓఆర్ఆర్ లోపలి భాగంలో కోర్ అర్బన్‌గా, ఓఆర్ఆర్ అవతలి నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు సెమీ-అర్బన్‌గా, రీజినల్ రింగ్ రోడ్డు అవతలి భాగంలో గ్రామీణ ప్రాంతంగా విభజించి, ప్రాంతాల వారిగా ప్రణాళికా బద్ధమైన అభివృద్ధితో ముందుకు వెళతాం.

CM Sri A. Revanth Reddy participated in Rythu Nestham program at Rajiv Gandhi Statue, opposite Dr. BR Ambedkar State Secretariat | Rythu Bharosa.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో రైతులు ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 16 వందల రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్షలాది రైతులు వీక్షించారు.

Skip to content